సంబంధిత వార్తలు
- తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించండి : అమిత్ షాకు జగన్ వినతి
- చెప్పులు లేనివాళ్లు కూడా రాష్ట్రపతి భవన్లో అడుగుపెడుతున్నారు : అమిత్ షా
- ఆంధ్రప్రదేశ్ నెత్తిన కొండలా రెవెన్యూ లోటు! : వెల్లడించిన కాగ్ నివేదిక
- తిరుపతి వేదికగా దక్షిణాది జోనల్ కౌన్సిల్ భేటీ : ఈ రోజు టాపిక్ ఏంటి?
- దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ: ప్రముఖులతో సందడిగా మారిన తిరుపతి
జగన్ కు అమిత్ షా హామీ
జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని.. తప్పకుండా వీటన్నింటికీ పరిష్కారం చూపుతామని కేంద్ర మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షా హామీ ఇచ్చారు.
తిరుపతిలోని తాజ్ హోటల్ వేదికగా జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు.
ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. అంతేకాదు..
జగన్ ప్రస్తావించిన అంశాలేంటి..!?
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేయాలి.. విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు దాటినా హామీలు అమలుకాలేదు. ఇది విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే.
రీసోర్స్ గ్యాప్నూ భర్తీ చేయలేదు. తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఇప్పించాలి. తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు ఊరట నివ్వాలి. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారు.
దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలి. రేషన్ లబ్ధిదారుల గుర్తింపుపై కేంద్రం ప్రక్రియలో హేతుబద్ధత లేదు. దీనిపై వెంటనే సవణలు చేయాలి అని సమావేశంలో కీలక అంశాలను జగన్ ప్రస్తావించారు.
తర్వాతి కథనం
