1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Andhra: Jagan questions Opposition over Bill defeat

మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు ఏం సాధించాయి.. జగన్

Jagan
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు తాము ఏమి సాధించామని ప్రశ్నించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026కు మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో, దానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలను జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికపై ప్రశ్నించారు.
 
2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే, దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పోస్టులో విపక్ష పార్టీలు తమను తాము తీవ్రంగా ప్రశ్నించుకోవాలి. ఈ పార్టీలు విపక్ష పార్టీలు ఏం సాధించాయని.. వాస్తవానికి దక్షిణాదిలో జనాభా తగ్గుతుండగా, మహిళా రిజర్వేషన్ బిల్లును వాయిదా వేశారు. దక్షిణాదికి గానీ, మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు వస్తే, దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. క్రమశిక్షణ విషయాలలో వెనుకబడినందుకు మరింతగా శిక్షించబడతారు.. అని పేర్కొన్నారు. 
 
మరోవైపు మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ పన్నిన మోసపూరిత కుట్ర విఫలమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి తన స్పందనలో అన్నారు. మహిళల సమస్యలను ఒక తెరచాటుగా ఉపయోగించి అక్రమ చట్టాలను ఆమోదింపజేయాలనే కుట్ర విఫలమైందని ఆమె ఆరోపించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలమవడానికి బీజేపీనే కారణం.. కేటీఆర్ ఫైర్