1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (18:54 IST)

ఏపీలో 500 దాటిన కరోనా- 24 గంటల్లో 567 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి వరకు తగ్గిన కరోనా కేసులు ప్రస్తుతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి రోజున నాలుగు వందలకు దిగువన కరోనా కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆ సంఖ్య 500 దాటింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 567 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
 
దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,64,854కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఎనిమిది మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,364 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4777 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.
 
ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 39,545 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,93,65,385 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 437 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,45,713 లక్షలకు చేరింది.