సంబంధిత వార్తలు
- సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సక్సెస్... ప్రధాని సహా ఆరుగురు మంత్రులతో భేటీ
- సీఎంను కలవనీయకుండా అడ్డుకుంటున్నారు ... ఎవరా ముగ్గురు?
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ భేటీ
- దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ
- ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ గంట భేటీ... ఏం మాట్లాడుకున్నారు?
ఏపీ ఉద్యోగుల పిఆర్సి ఫైనల్... సీఎం జగన్ తో భేటీ
ఏపీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పిఆర్ సీ తుది అంకానికి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రితో సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు గురువారం ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ఇంకా పీఆర్సీ వ్యవహారంపైన నాన్చటం సరి కాదని, ఏదో ఒకటి తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అందులో భాగంగా ఈరోజు మధ్నాహ్నం ముందస్తుగా సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేసారు.
అందులో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం ఉద్యోగులు ఫిట్ మెంట్ గా ఎంత కోరుతున్నారనే అంశంపైన అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్న 27 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఉండాలని సూచించారు. అయితే, అధికారులు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఫిట్ మెంట్ అంశం పైన ప్రస్తావన లేకుండానే, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల పైన వివరిస్తూ వచ్చారు. దీనిపైన సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి.
