సంబంధిత వార్తలు
- ప్రయాణికురాలి బ్యాగు నుంచి బంగారం చోరీ చేసిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ (Video)
- ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఎపుడు?
- సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?
- నా ఇంట్లో ఆడ బిడ్డలతో సహా మంత్రి అనిత కూడా బాధితురాలే... అందుకే అలా స్పందించా.. పవన్
- ఆర్టీసి బస్సు నడుపుతూనే గుండెపోటుతో ప్రాణాలు వదిలిన డ్రైవర్, ఏమైంది? (Video)
ఏపీ ఆర్టీసీ లగ్జరీ బస్సులు అలా ఢీకొన్నాయి.. డ్రైవర్ కాళ్లు విరిగిపోయాయి..
ఇంజన్లో సాంకేతిక లోపంతో హైవేపై ఆగిపోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ సంఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళుతుండగా ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో కేతేపల్లి సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది.
బస్సు సిబ్బంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు మరో బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో అదే మార్గంలో వస్తున్న వేయూరు డిపోకు చెందిన మరో ఆర్టీసీ లగ్జరీ బస్సు కేతేపల్లి వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఉయ్యూరు డిపో బస్సు డ్రైవర్ సి.హెచ్. శ్రీనివాస్రావుకు రెండు కాళ్లు విరిగిపోయాయి. అదనంగా, ముగ్గురు ప్రయాణికులు- పి. విజయవాడకు చెందిన సూర్య సాయి, తిరుపతమ్మ, ఎం. రజనిలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే 1033 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నక్రేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
