1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APSRTC Cargo Plans for Door Delivery Services from September

ఏపీఎస్ ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభం.. చార్జీలు ఇవే

apsrtc
ఏపీఎస్ఆర్టీసీలో కొత్త సేవలు ప్రారంభించనుంది. ఈ రోడ్డు రవాణా సంస్థ కార్గో విభాగాన్ని అందుబాటులోకి తీసుకునిరానుంది. అలాగే, డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50 కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్​ను ఇంటి వద్దకే చేర్చేలా చర్యలు తీసుకోనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది.
 
పార్శిల్ కౌంటర్ నుంచి 10కిలో మీటర్ల పరిధిలో ఈ డోర్ డెలివరీ అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్​లోని జిల్లా కేంద్రాలు, 84 ముఖ్యపట్టణాలలో డోర్ డెలివరి సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సేవలకు వసూలు చేసే ధరలను కూడా ప్రకటించింది ఒక కేజీ వరకు రూ.18, 1 నుంచి 6 కేజీల వరకు రూ.30, 6 నుంచి 10 కేజీల వరకు రూ.36, 10 నుంచి 25 కేజీల వరకు రూ.48, 25 కేజీల వరకు 50 కేజీల వరకు రూ.59 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. 
 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఢిల్లీలో మంకీపాక్స్ కేసు... ఆరోగ్య శాఖ అత్యున్నత స్థాయి భేటీ