శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (18:20 IST)

అన్యమత ప్రచారం బోర్డు జరిగిన సిటీ బస్సులు నిలిపివేత

సింహగిరిపై భక్తులను తరలిస్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులపై అన్యమత ప్రచారాన్ని సంబంధించిన స్టిక్కర్లు ఉండడాన్ని దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సూపరింటెండెంట్ ముద్దాడ వెంకట రమణ గమనించి ఆ బస్సులను నిలిపివేశారు. బస్సు డ్రైవర్ కండక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
అన్యమత ప్రచారం బోర్డులు కలిగిన సిటీ బస్సులను సింహగిరిపై నడపడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియచేశారు. ఈ విషయాన్ని వెంకటరమణ ఆలయ ఈవో వెంకటేశ్వరరావుకు తెలియజేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు దించి వేసి ఆ బస్సులను ఖాళీగా దిగువకు వెంకటరమణ పంపించివేశారు. 
 
సింహగిరిపై వచ్చేసింది బస్సులపై హిందూ మత ప్రచారం తప్ప అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అటువంటి బస్సు తీసుకురావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు వెంకటరమణ తెలియజేశారు. 
 
ఈ సంఘటనపై సింహాచలం డిపో మేనేజర్‌కి తీసుకెళ్లగా అన్యమత ప్రచారం చేస్తున్న బోర్డులు ఉన్న బస్సుల‌ను కొండమీదకు పంపకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.