1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Chiranjeevi Couple at Sabarimala Temple

శబరిమలైకు డోలి వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న చిరంజీవి

Chiranjeevi Couple
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత శబరిమలై పుణ్యక్షేత్రానికి వెల్లారు. భక్తులు, అభిమానుల తాకిడి దెబ్బకు ఆయన కొండపైకి నడిచి వెళ్లకుండా, డోలిలో పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా షేర్ చేశారు. 
 
"చాలా యేళ్ల తర్వాత శబరిమలకు వచ్చి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే, భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా అందరినీ అసౌకర్యానికి గురిచేయకుండా, డోలిలో వెళ్లవలసి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమధారపోస్తున్న ఆ శ్రమైక సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో ఫీనిక్స్ చుక్కపల్లి సురేష్, ఫీనిక్స్ గోపి గార్ల కుటుంబాలకుతోడు మంచి అనుభూతిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు అంటూ ట్వీట్ చేసారు.

 
తర్వాతి కథనం
వైకాపా నేతలకు పనీపాట లేదు : అఖిలప్రియా రెడ్డి