1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Corona effect: leave for TTD staff

కరోనా వైరస్ ఎఫెక్ట్‌: టీటీడీ ఉద్యోగులకు సెలవులు

leave
కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు అధికారులు సెలవులు ప్రకటించారు. 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరుకావాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

సెలవులో ఉన్న ఉద్యోగులు వచ్చేవారం విధులకు వచ్చేలా ఆదేశాలిచ్చారు. కొంతమంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌కు అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్‌ 4 వరకు వర్తిస్తాయని టీటీడీ అధికారులు జీవో జారీ చేశారు.
 
లాక్‌డౌన్‌లో వేతనాలు చెల్లించండి
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులను తొలగించడం గానీ, వేతనాల్లో కోత విధించడంగానీ చేయవద్దని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సూచించవలసిందిగా కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.

ముఖ్యంగా క్యాజువల్‌, కాంట్రాక్టు వర్కర్ల విషయంలో మరింత సానుకూలంగా వ్యవహరించవలసిందిగా సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సహకరించాలని సోమవారం కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి హెచ్‌కే స్మారియా విజ్ఞప్తి చేశారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
నేటి నుంచి డొమెస్టిక్ విమానాలు రద్దు