శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (16:22 IST)

డేటా చోరీపై విచారణ మొదలుపెట్టిన బృందాలు..

ప్రస్తుత కాలంలో వస్తువులు, ఆభరణాలు, ఇతర పదార్థాలు చోరీకి గురవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా డేటా చోరీ కూడా జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఐటీ గ్రిడ్స్ చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన సిట్ వేగంగా పావులు కదుపుతోంది. ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. 
 
కేసును అన్ని విధాల్లో విచారిస్తూ.. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవైపు డేటా చోరీకి కారణంగా ఉన్న సాక్షుల, నిందితుల విచారణ చేపడుతూనే మరోవైపు డేటా యూజర్ల సమాచారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సిట్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. 
 
సైబర్ క్రైమ్ పోలీసులతో ఓ బృందం.. కేసుకు సంబంధించిన సైబర్ నిపుణుల సలహాలతో డేటా అనాలసిస్, డేటా రిట్రైవ్ చేపట్టనుంది. ఈ డేటా చోరీకి సంబంధించి సాక్షులను, నిందితులను విచారించడానికి సీనియర్ అధికారితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కేసుకు సంబంధించి ఏపీ పోలీసులతో సంప్రదింపులు జరుపనుంది.
 
మిగిలిన రెండు బృందాలు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ ఆశోక్ కోసం గాలింపు చేపట్టనున్నాయి. అంతేకాదు.. కేసుకు సంబంధించిన యూజర్ల సమాచారం ఇవ్వాల్సిందేనని అమెజాన్ గూగుల్‌ని కోరింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను యూఐడీఎఐ.. ఎన్నికల కమీషన్‌లకు లేఖ ద్వారా సిట్ సమాచారం అందజేయనుంది.