సంబంధిత వార్తలు
- స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం... ఎక్కడ?
- డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు.. ఉచితంగా శిక్షణ
- భార్య ముందే ప్రియురాలికి వీడియో కాల్స్, భరించలేని ఆమె...
- తిరునెల్వేలిలో ఇరుట్టుకడై హల్వా యజమాని ఆత్మహత్య!
- పదిలక్షల మంది ఫాలోయర్స్ వున్న పదహారేళ్ల టిక్ టాక్ స్టార్ సియా కక్కర్ ఆత్మహత్య
ముఖంపై మచ్చలు.. అందంగా లేనని డిగ్రీ విద్యార్థి సూసైడ్?
ముఖంపై నల్లటి మచ్చలు ఉండటంతో అందంగా లేనని భావించిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మాణిక్యపురంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిగ్రీ విద్యార్థి సునీల్ నాయక్ (20) ముఖంపై చిన్నప్పటి నుంచి మచ్చలు ఉండేవి. అందవిహీనంగా కనపడుతున్నానని ప్రతి రోజు బాధపడేవాడు. ఈ మచ్చలు పోయేందుకు ఎన్నో రకాలైన క్రీములు వాడాడు. వైద్యులను సంప్రదించాడు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో కుంగిపోయాడు.
కాలేజీకి వెళ్లే సమయంలో ముఖంపై కర్చీఫ్ కప్పుకునే వెళ్లేవాడు. తాను అందంగా లేకపోవడంతో భవిష్యత్తులోనూ తననందరూ చులకనగా చూస్తారని భావించాడు. ఈ బాధతోనే ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని పోలీసులు.. సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేడు కరోనా పరీక్ష చేసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
