1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Devotees rush increased at Tirumala, to take 16 hours for Sarvadarshans

తిరుమల: సర్వదర్శనానికి 16 గంటలు.. హుండీ ఆదాయం రూ.4.01 కోట్లు

venkateswara swamy
శ్రీవారి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనానికి 16 గంటలు పట్టింది. కాగా ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉన్నవారు 4 గంటల్లో స్వామివారి దర్శనం పొందగలిగారు.
 
అలాగే భక్తులు 6 కంపార్ట్‌మెంట్లలో టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డి) దర్శనం కోసం వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం 5 గంటల వేచి ఉన్నారు.
 
కాగా, సోమవారం 71,824 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదనంగా స్వామివారికి కానుకగా హుండీలో రూ.4.01 కోట్లు చేరింది.
తర్వాతి కథనం
ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...