1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Drinking alcohol, Corona Virus threat is high

మద్యం తాగితే.. కరోనా ముప్పు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

alcohol
మద్యం తాగడం వల్ల కోవిడ్ -19 వైరస్ ప్రభావం మరింత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కరోనా లాక్‌డౌన్ సమయంలో మద్యం వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫారసు చేసింది.

‘ఆల్కహాల్ తాగితే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, తద్వారా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని యూరప్ లోని WHO ప్రాంతీయ కార్యాలయం పేర్కొంది. 
 
ఆల్కహాల్ వినియోగం అనేక సంక్రమణ వ్యాధులతో ముడిపడి ఉంది. కోవిడ్ -19కు సంక్రమించే వ్యక్తికి మరింత హాని చేస్తుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మాట్లాడే ప్రవర్తన, హింసను కూడా పెంచుతుంది.

ప్రత్యేకించి సామాజిక దూరం వంటి చర్యలను అమలు చేసిన దేశాలలో ప్రజలను వారి ఇళ్లలో నిర్బంధంగా ఉంచుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల కరోనావైరస్‌ను చంపుతుందని అపోహలపై ఒక ఫ్యాక్ట్ షీట్‌ను కూడా ప్రచురించింది. 
 
మద్యం సేవించడం కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పాటు మరణానికి కూడా దారితీస్తుందని తెలిపింది. ప్రత్యేకించి మిథనాల్‌తో కల్తీ అయితే మాత్రం.. ఏడాదిలో సుమారుగా 3 మిలియన్ల మరణాలు మహమ్మారికి కారణంగా నమోదయ్యే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది.

అందుకే ప్రజలు మద్యపానాన్ని తగ్గించాలి. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో మద్యానికి దూరంగా ఉండాలని WHO కార్యాలయం తెలిపింది.
About Writer
ఎం