శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 జులై 2019 (12:44 IST)

మతిస్థిమితం లేని కుమార్తెను నరికి చంపిన కసాయి తండ్రి

మతిస్థిమితం లేని కుమార్తె ఆలనాపాలనా చూడలేక ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి శ్యామల (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ళ క్రితం వివాహం చేశాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతిస్థిమితం కోల్పోవడంతో భర్త వదిలివేశాడు.
 
అప్పటి నుంచి శ్యామల పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.