1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Gang War in Triupati - Student Murder

తిరుపతిలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్.. విద్యార్థి హత్య

Tirupati
కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన 20 ఏళ్ల ద్వారకనాథ్ అనే విద్యార్థిని సహ విద్యార్థులు హతమార్చారు. తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్‌ను శెట్టిపల్లి రైల్వే గేటు వద్దకు పిలిపించి హత్య చేశారు. 
 
బీరు బాటిల్‌లతో దాడి చేసి కత్తులతో మెడపై పొడిచి దారుణ హత్యకు పాల్పడ్డారు. విద్యార్థుల మధ్య గొడవలే హత్యకు కారణమని అలిపిరి పోలీసులు భావిస్తున్నారు.

తల్లిదండ్రులు కువైట్‌లో ఉంటుండగా ఏడాదిన్నర క్రితం చదువుకునేందుకు తిరుపతికి వచ్చి శెట్టిపల్లిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్న ద్వారకనాథ్. హత్యకు పాల్పడిన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
మంగళగిరిలో ఆరని ఇళ్ల చిచ్చు...