1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Inter Examination in Andra Pradesh starts from Today

నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైతే...

Inter Examinations
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,01,058 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సర విద్యార్థులు సరి సమానంగా ఉన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. 
 
అయితే, ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం లేదా హాలులోకి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఐదు చొప్పు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు విద్యా శాఖ తెలిపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ - భారీ బహిరంగ సభ