శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మే 2022 (11:12 IST)

రాజధానిపై కోర్టు తీర్పును ధిక్కరించిన సర్కారు.. నేడు హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మరోమారు తెరపైకి వచ్చింది. రాజధానే అమరావతి అంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీచేసింది. అయితే, ఏపీ సర్కారు మాత్రం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ పాలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 
 
అమరావతిపై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరుగనుంది. 
 
రైతుల తరపున ఉన్నం మురళీధర్ అనే న్యాయవాది హాజరుకానున్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. నిధులు లేవనే సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం జాప్యం చేస్తుందని ప్రధానంగా ప్రస్తావించారు.