సంబంధిత వార్తలు
- పవన్ కల్యాణ్: ‘ఇంకొకసారి నన్ను వాళ్లకు, వీళ్లకు దత్తపుత్రుడు అంటే జగన్ను సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుంది’
- కర్నాటకలో నిన్న హిజాబ్ వివాదం... నేడు లౌడ్ స్పీకర్ల రచ్చ
- అరేంజ్డ్ మ్యారేజ్ వర్సెస్ లవ్ మ్యారేజ్: 'కూ' పోల్లో ఆసక్తికర కామెంట్స్
- అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు
- నిద్ర లేకపోవడం ఓ జబ్బు... దయచేసి వైద్యం చేయించండి... ప్రకాష్ రాజ్
మంత్రి పదవిపై స్పీకర్ కామెంట్స్- నేను దేనికైనా సిద్ధం
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తానెప్పుడూ పదవులను ఆశించలేదని తెలిపారు.
సీఎం జగన్కు తాను సమస్య కాకూడదన్న ఆయన ఏ పని అప్పగించినా చేయటానికి నేను సిద్ధమని స్పష్టం చేశారు. మంత్రి పదవులు రాని వాళ్లకు కొంత బాధ ఉంటుందనేది వాస్తవమన్నారు.
కొత్త కేబినెట్ కూర్పు బాగుందన్న తమ్మినేని సీతారాం.., అన్ని వర్గాల దామాషా పద్ధతితో మంత్రి పదవులు కేటాయించారని అభిప్రాయపడ్డారు. మాట్లాడేవాళ్లు, చర్చించే వాళ్లు వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని హితవుపలికారు.
తనకు మంత్రిపదవి వస్తుందని పత్రికలు రాసినా తాను మాత్రం ఆశలు పెట్టుకోలేదని తమ్మినేని సీతారాం అన్నారు. వెనుబడిన వర్గాల వారికి వెనుకబాటుతనం లేదనే ధైర్యం జగన్ కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు చూశామని.., రేపు ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా విజయాన్ని ప్రజలే చూస్తారని జోస్యం చెప్పారు.
