1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:20 IST)

తిరుమల దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్

ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ 51 నమూన రాకెటును శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10:24 గంటలకు పీఎస్ఎల్వీసీ 51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు.

ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని చెప్పారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్‌లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ పేర్కొన్నారు.