1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Jannaram crime news

ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడిచే మూత్రం తాగించారు..

Jannaram
ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. ప్రేమిస్తే కేసులు పెట్టడం లేదంటే నచ్చజెప్పడమో చేయాలి కానీ.. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఓ దళిత యువకుడు ప్రేమించాడని చెప్పి అతడిచే మూత్రం తాగించారు. దీనిపై ఎస్సి, ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. కేసును సుమోటో గా స్వీకరించి విచారణ జరపాలని అదికారులను ఆదేశించింది.
 
జన్నారం మండలానికి చెందిన అన్వేష్ అనే మైనర్ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయితో యువకుడు అడవిలోకి వెళ్లగా స్నేహితులతో విషయం తెలుసుకున్న యువతీ బంధువులు కర్రలతో దాడిచేసి మూత్రం తాగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్వేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్ల జర్నీ.. ఇవాంకా ప్రశంసలు