శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మే 2020 (12:18 IST)

భార్యపై అనుమానం.. భర్త ఎంత పనిచేశాడో తెలుసా? కరోనా మందు అని..?

భార్యపై అనుమానంతో ఓ భర్త చేసిన నిర్వాకం అతడిని జైలుపాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌కు చెందిన ప్రదీప్‌(42).. తన భార్యకు ఓ హోమ్‌గార్డ్‌తో సంబంధముందని అనుమానించాడు. దీంతో ఆ హోమ్‌గార్డ్‌ కుటుంబాన్ని అంతమొందించాలని భావించి ఇద్దరు మహిళలను నియమించుకున్నాడు. ఆదివారం వారిని ఆరోగ్య కార్యకర్తల్లా హోమ్‌గార్డ్‌ ఇంటి కెళ్లమని చెప్పి, కరోనా వైరస్‌కు నివారణ మందు ఇస్తున్నట్లు నమ్మించాడు. 
 
అయితే విషం కలిపిన ఓ బాటిల్‌ను ఆ మహిళలు హోమ్‌గార్డ్‌ కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో.. ఆ ఇంట్లోని ముగ్గురూ అది తాగి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై సమీపంలోని ఆస్పత్రికెళ్లడంతో బతికి బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
 
కేసు విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్‌ తమకు డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాడని మహిళలు విచారణలో చెప్పడంతో అతడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తన ప్రతీకారాన్ని తీర్చుకోడానికి ప్రదీప్ కరోనా వైరస్‌ను అవకాశంగా మార్చుకున్నాడని  పోలీసులు చెప్పారు.