ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం గౌరవ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాన్ని అందజేశారు. రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ .పి .సిసోడియా కూడా జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం...