1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kakinada : Another Fire Accident at Parry Sugars Two Workers Died

వాకలపూడి ప్యారీ షుగర్స్‌లో మరోమారు అగ్నిప్రమాదం

fire accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడ జిల్లాలోని వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ ఫ్యాక్టరీలో మరోమారు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ నెల 19వ తేదీన ఇదే ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 
 
ఈ ఘటన మరువకముందే సోమవారం మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రాగం ప్రసాద్, సుబ్రహ్మణ్యేశ్వరరావుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు కార్మికులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
తర్వాతి కథనం
పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం.. 24 గంటల్లో 120మంది మృతి