శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 14 జులై 2021 (22:12 IST)

కృష్ణా నదీ జల వివాదం, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన ఏపీ

కృష్ణా జ‌ల వివాదం చివ‌రికి రెండు రాష్ట్రాల మ‌ధ్య న్యాయ పోరాటానికి తెర‌లేపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనితో ఇక ఈ జ‌ల వివాదాన్ని సుప్రిం కోర్టు ప‌రిష్క‌రించాల్సిందే అని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

ఇంత వ‌ర‌కు దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీయార్ క‌ల‌సి కుర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు నేత‌లు చెపుతూ వ‌చ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకు న్యాయ‌పోరాటానికి దిగిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.