సంబంధిత వార్తలు
- అవిశ్వాసానికి సిద్ధమవుతున్న ఎన్డీయే.. మంగళవారం చర్చ సాగుతోందా?
- ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు.. అమిత్ షా గారూ... త్వరలో లేఖ రాస్తాం: నారా లోకేష్
- ఏంటీ... మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేదా? భాజపా ఎంపీలకు నరేంద్ర మోదీ క్లాస్
- అమరావతికి వెయ్యి కోట్లిచ్చాం.. తప్పంతా చంద్రబాబుదే: అమిత్ షా ఆశ్చర్యం
- టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు
బడా పారిశ్రామికవేత్తలు కోట్లు కొల్లగొట్టి పారిపోతున్నారు: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాజకీయ నేతలు నిప్పులు చెరుగుతుంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిప
కేంద్ర ప్రభుత్వంపై ఏపీ రాజకీయ నేతలు నిప్పులు చెరుగుతుంటే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు వేల కోట్లు కొల్లగొట్టి దేశం విడిచి పారిపోతుంటే.. కేంద్రం మౌనంగా వుందని కేటీఆర్ విమర్శించారు. ఇదే సమయంలో కేంద్రం చిన్న పారిశ్రామికవేత్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతుందని కేటీఆర్ మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వానికి మాటలే తప్ప, చేతల్లో ఏం లేవని కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఐటీఐఆర్, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికీ, ఐటీ విస్తరణకు తామే చర్యలు చేపట్టామని కేటీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ ద్వారా 1.2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి బడా పారిశ్రామిక వేత్తలు కోట్లు దోచుకుని పారిపోతుంటే కేంద్రం చేతులు ముడుచుకుని కూర్చుందని కేటీఆర్ అన్నారు.
మరోవైపు విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు, విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉంటున్నారని, వీళ్లిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటి? అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. విజయ్ మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, విజయసాయి సభ్యత్వం కొనసాగిస్తున్నారని విమర్శించారు. వీరిద్దరూ ఆర్థిక నేరస్థులని, వారి మధ్య వ్యత్యాసమేమీ లేదని, అలాంటప్పుడు విజయ్ మాల్యాకు ఓ న్యాయం? విజయసాయిరెడ్డికి మరో న్యాయమా? అంటూ చంద్రబాబు కేంద్రంపై నిప్పులు చెరిగారు.
