సంబంధిత వార్తలు
- ఆ నాలుగు గ్రామాల్లో రీ-పోలింగ్ జరపాలి.. అంబటి డిమాండ్
- పల్నాడులో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి.. టిప్పర్ ఢీకొనడంతో...
- చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి - video
- మే 13న పోలింగ్.. ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచండి సార్.. చంద్రబాబు
- మెగా సర్వీస్ క్యాంపును తిరుపతికి తీసుకువస్తోన్న జావా యెజ్డీ మోటర్సైకిల్స్
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత
తిరుమల శ్రీవారి ఆలయానికి నడకదారిన వెళ్లే భక్తులు కాస్త అప్రమత్తంగా వుండాలి. తిరుమల నడక మార్గంలో చిరుత పులులు సంచరిస్తుండటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.
తాజాగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై భక్తుల డిమాండ్ మేరకు చిరుతను పట్టుకునే పనిలో పడ్డారు.
గతేడాది అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం కలకలం రేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది.
దీంతో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా ఆరు చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు.
