శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (08:56 IST)

తెలంగాణాలో మరోవారం లాక్డౌన్ ప్రారంభం : సీఎం కేసీఆర్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో మరోవారం రోజులు పాటు లాక్డౌన్ పొడగించే అవకాశం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, వైద్యాధికారుల ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే ఈ విషయంపై వాణిజ్య, ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సంకేతాలిచ్చిందట. ఇదిలావుంటే, కరోనా నియంత్రణ, లాక్‌డౌన్ పొడిగింపు అంశాలపై సీఎం కేసీఆర్ ఈ నెల 28వ తేదీన సమీక్ష నిర్వహించనున్నారు. ఆ రోజే లాక్‌డౌన్ పొడిగింపుపై అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
 
జూన్ మొదటి వారం వరకు లాక్‌డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్‌డౌన్ కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. కాగా, ప్రస్తుతం తెలంగాణలో నేటి నుంచి రెండు డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది.
 
మరోవైపు, కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ కరోనాను కట్టడి చేయాలని సూచించారు. 
 
దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని పేర్కొన్నారు. దాన్ని కొనసాగిస్తూనే, ప్రాధమిక వైద్య కేంద్రాలకు కరోనా పరీక్షల కోసం వస్తున్న ప్రతి ఒక్కరికీ నిరాకరించకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలన్నారు.