శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:45 IST)

కంపెనీలను జగన్ పో..పో... తెలంగాణ రా..రా: లోకేష్

తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం..జగ్లక్ పాలన చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల వృథా ఖర్చు తప్ప ప్రయోజనం లేదన్నారు.

ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఒక్క జీవోతో కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాయిటర్స్‌పై ఎల్లో మీడియా అంటూ విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కంపెనీలను జగన్ పో..పో అంటుంటే..తెలంగాణ రా..రా అంటోందన్నారు.