1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. mp revanth reddy makes sensational comments on kcr and ktr

కేసీఆర్ ప్రాణాలకు ముప్పు వుంది.. భద్రతను మరింత పెంచాలి.. రేవంత్

Mp
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు అనుక్షణం భద్రత కల్పించాల్సిన అవసరమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, కేసీఆర్‌ను దించి వేయాలని ఎర్రబెల్లి దయాకర్ వంటి నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో, టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో అర్థం చేసుకోవాలన్నారు. 
 
టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని, కేసీఆర్ ఇంట్లో అర్థరాత్రి పూట ఏమైనా జరగవచ్చని, అల్లుడి నుంచి ముప్పు తగ్గిందని, కుమారుడు కేటీఆర్ నుంచి ఆయనకు ముప్పు ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ ఇంట్లోనే కేటీఆర్ ఉంటున్నారని, ఆయన్ను ఆ ఇంటి నుంచి పంపించి వేయాలన్నారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సీఎం పదవి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతోందని చెప్పారు. కేటీఆర్ సీఎం పదవిని ఆశిస్తున్నారని, వెంటనే ఆయనకు పదవిని ఇవ్వకుంటే ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేటీఆర్‌ను ప్రగతి భవన్ నుంచి వెంటనే ఖాళీ చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు భద్రతను మరింత పెంచాలని తెలిపారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అమరావతికి పంచాయతీ ఎన్నికలే..