శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (16:11 IST)

మింగడానికి మెతుకు లేదుగానీ... 33 రాజధానులా?

నవ్యాంధ్ర రాజధాని తరలింపు అంశంపై రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధానిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తారు. ఈనేపథ్యంలో తుళ్లూరులో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'మింగడానికి మెతుకు లేదుగానీ.. 33 రాజధానులు నిర్మిస్తారా...? నిజంగా అంత ధైర్యముంటే అమరావతి నిర్మాణం పూర్తి చేశాక.. ఎన్ని రాజధానులు నిర్మిస్తావో నిర్మించు' అంటూ సవాల్ విసిరారు. 
 
నాడు అమరావతికి అంగీకరించిన జగన్‌.. ఇవాళ ఎందుకు ప్లేటు మార్చారంటూ నిలదీశారు. రాజధాని మార్పు సీఎం సొంత సమస్య కాదని.. 5 కోట్ల మంది ప్రజలదని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని గొట్టిపాటి రామకృష్ణ అన్నారు.
 
అలాగే, బీజేపీ నేత గోపీనాథ్ దాస్ స్పందిస్తూ, రాష్ట్రంలో రావణరాజ్యం నడుస్తోందని.. ప్రజల కష్టాలు చూస్తూ సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.