సంబంధిత వార్తలు
- 70 మందితో తెదేపా తొలి అభ్యర్థుల జాబితానా? నాన్సెన్స్... ఎవరు?
- పీఆర్పీ దెబ్బతిన్న తర్వాత పార్టీ పెట్టి ఇలా నడపాలంటే... పవన్ కళ్యాణ్
- ఎన్టీఆర్ గారు కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అన్నారు: పవన్ కళ్యాణ్
- గుమాస్తాలా పనిచేస్తున్నా.. సీఎంలా కానేకాదు.. కన్నీళ్లతో కుమారస్వామి
- అఖిల ప్రియకు హ్యాండిచ్చిన చంద్రబాబు? జగన్ - పవన్ల వైపు చూపు
ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదు.. పవన్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై విరుచుపడ్డారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ప్రశ్నించారు. తాను ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతారని పవన్ కల్యాణ్ తెలిపారు.
16 ఏళ్ల ప్రాయంలోనే తన్ని తరిమేశానని చెప్పారు. చింతమనేనిలాంటి వ్యక్తులను వెనకేసుకొస్తున్న టీడీపీకి తాను అండగా ఎందుకుండాలని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రజా సంక్షేమం కోసం ఎవరితోనే గొడవకు రెడీ అన్నారు. టీడీపీ నేతలను తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశానని పవన్ చెప్పారు. జగన్లా చంపేయండి, చింపేయండి అనలేదన్నారు.
2014లో జనసేనని స్థాపించినప్పుడు జగన్ సీఎం అవుతున్నాడు నువ్వేం చేస్తావని అన్నారని, కానీ తాను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్క నాయకుడు కూడా మనకి అండగా నోరు మెదపలేదని గుర్తు చేశారు.
తర్వాతి కథనం
