1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Prabodhananda Swami Controversial Comments

అలాంటి వారు భక్తి వ్యభిచారులు.. ప్రభోదానందస్వామి

పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలి

Prabodhananda Swami
పబ్లిసిటీ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ప్రభోదానంద స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను శ్రీకృష్ణుడిని మాత్రమే ఆరాధిస్తున్నానని.. భగవద్గీతను అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువమంది దేవుళ్ళను ఆరాధించేవారు భక్తి వ్యభిచారులని ప్రబోధానంద స్వామి అన్నారు.


తమ ఆశ్రమంపై పలువురు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రభోదానంద ఖండించారు. అదే విధంగా చిన్నపొలమడలో జరిగిన హింసాత్మక సంఘటనపై స్పందించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో చిన పొలమడ వద్ద ప్రభోదానంద ఆశ్రమం వద్ద జరిగిన హింసాత్మక సంఘటలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రభోదానందపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా మరొకొందరు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ప్రభోదానంద స్వామిపై కేసు నమోదు చేశారు.

తన కేసు విషయాన్ని కోర్టులే తేలుస్తాయని అన్నారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం జరిగిన రోజున హింసాత్మక సంఘటనలు జరగడం ఆ ఘటనలో కొందరు చనిపోవడానికి కారణం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డేనని ప్రభోదానంద ఆరోపించారు.
About Writer
selvi
తర్వాతి కథనం
షాకింగ్... తల్లి శవంపై కూర్చుని కుమారుడు అఘోర పూజ...