1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 12 నవంబరు 2018 (19:56 IST)

50 మంది బాలికలపై అకృత్యానికి పాల్పడిన కామాంధుడికి జైలు

అభంశుభం తెలియని చిన్నారులను లైంగికంగా వేధించాడు. పది సంవత్సరాల పాటు బెదిరించి కొంతమంది బాలికలపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. గర్భం దాలిస్తే తీయించాడు. ఇలా ఒకరిద్దరు కాదు ఎంతోమంది మైనర్ బాలికలపై ఆకృత్యానికి పాల్పడిన తిరుపతికి చెందిన ప్రభుత్వ బాలిక వసతి గృహం కామాంధుడికి శిక్ష పడింది. ఒక మైనర్ బాలిక ప్రాణాలకు తెగించి కామాంధుడి దురాగతాలను బయట పెట్టడంతో కటాకటాల్లో శిక్ష అనుభవిస్తున్నాడు కామాంధుడు. 
 
తిరుపతి సరోజినీదేవి రోడ్డులోని బాలికల వసతి గృహం సూపరింటెండెంట్ నందగోపాల్ గత పదిసంవత్సరాలుగా మైనర్ బాలికపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఎవరూ లేని అనాథ పిల్లలను బెదిరించి లొంగదీసుకొని వారి జీవితంతో చెలగాటమాడుకుంటున్నాడు. కడప జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక తల్లి మరణించి, తండ్రి ఒక కేసులో జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో 2014 సంవత్సరంలో చేరింది.
 
అప్పటి నుంచి సూపరింటెండెంట్ గోపాల్ ఆ మైనర్ బాలికను లొంగదీసుకుని రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. ఈ బాలిక ఒక్కటే కాదు.. ఇంకా చాలామంది ఉన్నారు. సూపరింటెండెంట్ దురాగతాలను ఐదేళ్ళ పాటు ఓర్చుకుంటూ వచ్చిన బాలిక కడప వసతి గృహానికి వెళ్లింది. అక్కడకు వెళ్ళగానే కొంతమంది బాలికల సహాయంతో మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి నందగోపాల్ పైన కేసు కూడా నమోదు చేశారు. ఈరోజు తెల్లవారుజామున నిందితునిపై పోక్సో యాక్ట్ కింద అరెస్టు చేసి తిరుపతి సబ్ బైలుకు తరలించారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ను విధించారు.