సంబంధిత వార్తలు
- కోవిడ్ రోగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు
- ఆర్టీసీ బస్సుల్లో శ్రీవారి శీఘ్ర దర్శనం టిక్కెట్లు... ఛార్జీపై అదనంగా రూ.300 చెల్లించి టిక్కెట్లు బస్సుల్లోనే పొందే వీలు
- దసరాకి తెలంగాణ నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలి: జనసేన
- హౌరా - సత్యసాయి ప్రశాంతి నిలయం వీక్లీ ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ
- నెల్లూరు జిల్లాలో 1 నుంచి హౌసింగ్ మెగా గ్రౌండింగ్
ఆర్టీసీ బస్సులకు పెరుగుతున్న రద్దీ
ప్రజా రవాణా శాఖ(పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సోమవారం 49 శాతానికి చేరింది.
వారం రోజుల క్రితం 640 బస్సులు నడిపితే సగటు ఓఆర్ 41 శాతం నమోదైంది. బస్సుల సంఖ్య పెంచడంతో క్రమంగా ఓఆర్ పెరుగుతూ వచ్చింది. సోమవారం రీజియన్లో 680 బస్సులు ఆపరేట్ చేశారు.
ఇవి ఉదయం 6.00 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 1.53 లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. దీనివల్ల రోజువారీ ఆదాయం రూ.38 లక్షలు సమకూరిందని అధికారులు లెక్కలు కట్టారు. మంగళవారం కూడా ఇవే బస్సులు ఆపరేట్ చేస్తామని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాబిందు తెలిపారు.
తర్వాతి కథనం
