1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Rising congestion for RTC buses

ఆర్టీసీ బస్సులకు పెరుగుతున్న రద్దీ

RTC buses
ప్రజా రవాణా శాఖ(పీటీడీ)/ఆర్టీసీ విశాఖ రీజియన్‌ బస్సుల సగటు ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) సోమవారం 49 శాతానికి చేరింది. 

వారం రోజుల క్రితం 640 బస్సులు నడిపితే సగటు ఓఆర్‌ 41 శాతం నమోదైంది. బస్సుల సంఖ్య పెంచడంతో క్రమంగా ఓఆర్‌ పెరుగుతూ వచ్చింది. సోమవారం రీజియన్‌లో  680 బస్సులు ఆపరేట్‌ చేశారు.

ఇవి ఉదయం 6.00 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు 1.53 లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణించాయి. దీనివల్ల రోజువారీ ఆదాయం రూ.38 లక్షలు సమకూరిందని అధికారులు లెక్కలు కట్టారు. మంగళవారం కూడా ఇవే బస్సులు ఆపరేట్‌ చేస్తామని  డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ సుధాబిందు తెలిపారు. 
About Writer
ఎం
తర్వాతి కథనం
తెలంగాణ కాంగ్రెస్‌ లో కొత్త ఉత్సహం