సంబంధిత వార్తలు
- పోస్టాఫీసుల్లోనూ స్టాంప్ పేపర్ల అమ్మకాలు
- ఏప్రిల్ 15 నాటికి వైఎస్సార్ జగనన్న కాలనీల్లో బేస్ మెంట్లు పూర్తి చెయ్యాలి: కలెక్టరు ఏఎండి ఇంతియాజ్
- టీడీపీ ఏపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా
- 'నైపుణ్యం' మరింత వికసించాలి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- హోదా ఏపీకి ఇవ్వరు కానీ...పుద్దుచ్చేరికి ఇస్తారా?: ఏపిసిసి అధ్యక్షుడు శైలజానాథ్
నేటి నుండి సర్పంచుల పాలన
గ్రామ పంచాయతీల్లో శనివారం నుంచి సర్పంచ్ల పాలన మొదలు కాబోతోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు రాష్ట్రమంతటా నేడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
దాదాపు రెండున్నర ఏళ్లుగా ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు పని చేస్తున్నాయి. 2018 ఆగస్టు 1వ తేదీ నాటికే అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆగస్టు 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది.
