1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:58 IST)

కట్టుకున్న భార్యను కాదని వేరే మహిళతో కుళికిన హెడ్ కానిస్టేబుల్.. భార్యకు అలా దొరికిపోయాడు..?

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల పాప పుట్టింది. చివరికి ఓ హెడ్ కానిస్టేబుల్ భార్యను వదిలి వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో కట్టుకున్న భార్యను తిట్టడం.. ఇష్టం వచ్చినట్లు కొట్టడం చేస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం అతడు ఆమెను ఇంటి నుంచి బయటకు కూడా గెంటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, కేసు పెట్టింది. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. 
 
ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల నుంచి అతడు మరో యువతి మోజులో పడ్డాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య ఎంతో బాధపడింది. ఎలాగైన తన భర్త ఆట కట్టించాలని మహిళా సంఘాలకు విషయాన్ని చెప్పింది.
 
ఓ రోజు పక్కా ప్లాన్ ప్రకారం మహిళా సంఘాల సహాయం తీసుకొని అతడు ఆ మహిళతో ఉన్న సమయంలో మెరుపు దాడి చేసింది. ఇంకేముంది చెప్పు తీసుకొని కానిస్టేబుల్ ను.. అతడితో పాటు ఉన్న ఆమెను కూడా చితకబాదింది. 
 
వివరాల్లోకి వెళితే.. గడ్డం రాజేశ్‌ పాల్వంచ (చాతకొండ) 6వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 2011 సంవత్సరంలో అతడు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన స్వప్నను ప్రేమించి.. పెళ్లి కూడా చేసుకున్నాడు. వారికి ఆరేళ్ల పాప కూడా ఉంది. అయితే సాఫీగా సాగిపోతున్న కాపురంలో ఒక్కసారిగా విభేదాలు చోటుచేసుకున్నాయి. రాజేష్‌ ప్రతిరోజు స్వప్నను తిట్టడం, ఇష్టానుసారంగా కొట్టడం లాంటివి ప్రారంభించాడు. ఇలా రెండు సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
 
ఇటీవల రాజేశ్‌ తన భార్యను ఇంటి నుంచి గెంటేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న స్వప్న మహిళా సంఘాలను ఆశ్రయించింది. తర్వాత స్వప్న పక్కా ప్లాన్‌తో మహిళతో ఉన్న సమయంలో ఆమె మహిళా సంఘాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా రాజేష్‌ను పట్టుకుంది. అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. అతడితో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని చితకబాదింది.
 
రాజేష్‌కు మరికొంతమందితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపించింది. తన జీవితాన్ని నాశనం చేశాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. రాజేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ పాల్వంచ పోలీసులను డిమాండ్ చేసింది. స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.