1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (15:40 IST)

అప్పు తీర్చమన్న మహిళ.. కాలితో తన్నిన ఆటో డ్రైవర్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ దారుణం జరిగింది. తన వద్ద తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలని ఓ మహిళ కోరింది. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆ మహిళను కాలితో తన్నాడు. దీంతో ఆ మహి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాధితురాలు ప్రస్తుతం మంగళగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3 లక్షలు అప్పు ఇప్పించింది. అప్పు తీర్చమని అడుగుతుంటే గోపి పట్టించుకోలేదు. దీంతో గోపి స్వగ్రామం చిర్రావూరు వెళ్లి బాకీ తీర్చాలని అడిగింది. 
 
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గోపి.. గోవర్ధనిని కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె కుప్పకూలింది. అక్కడికి కాసేపటికి 100 నంబరుకు గోవర్ధని ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మంగళగిరి రూరల్‌ పోలీసులు గోపీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.