1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:05 IST)

టీడీపీ మహానాడు ఒక్క రోజు మాత్రమే.. వేదిక ఒంగోలు

tdplogo
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడును ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని తీర్మానించారు. ఈ మహానాడుకు ఒంగోలు వేదికకానుంది. 
 
సాధాణంగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ.రామారావు జయంతిని పురస్కరించుకుని ప్రతి యేడాది మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్చువల్ విధానంలోనే ఈ పార్టీ మహానాడును నిర్వహిస్తూ వచ్చారు. 
 
ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ఈ యేడాది ఒంగోలు కేంద్రంగా ఒక్క రోజు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. ఒంగోలు నగర శివారు ప్రాంతాల్లో ఈ మహానాడును నిర్వహించనున్నారు. అంతకుముందు రోజు నాలుగైదు వేల మంది ప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
 
28వ తేదీన నిర్వహించే మహానాడుకు ప్రతి ఒక్కరూ హాజరుకావొచ్చని టీడీపీ నేతలు తెలిపారు. అలాగే, ఆ రోజు నిర్వహించే భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారభించి వీటిని ఒక యేడాది పాటు నిర్వహిస్తారు.