1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Three workers killed in road accident in Guntur district

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు కూలీలు మృతి

Three workers
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. పలువురు కూలీలు గాయపడ్డారు.

ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ  ప్రమాదంలో మృతి చెందిన వారిని వెంకటేశ్వర్లు, నాగరాజు, అలివేలుగా గుర్తించారు పోలీసులు. వీరంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా కేసులు, కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం వైఫల్యం: అచ్చెన్న