సంబంధిత వార్తలు
- సమత కేసులోని దోషులకు ఉరిశిక్షలు ఖరారు
- ఏపీలో మాకు ప్రాణరక్షణ లేదు... హైకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె (video)
- అసదుద్దీన్ను క్రేన్కి తలకిందులుగా వేలాడదీసి గెడ్డం గొరిగిస్తా... ఆ తర్వాత: బిజెపి ఎంపి ధర్మపురి
- నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?
- యువతిని బెదిరించి ఐదు నెలలుగా అత్యాచారం
ప్రాణం తీసిన టి.వి. సౌండ్ వ్యవహారం..
TV
ఆర్మూరులో రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో బాల నర్సయ్య అతని భార్య అద్దెకు దిగారు. అయితే, వాళ్ళిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. దీంతో పక్కింట్లో ఉండేవాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంతే కాదు వీరు గొడవ పడెడప్పుడు టీవీలో వచ్చే మాటలు కూడా వినిపించేవి కాదట.
వారి మాటలు భరించలేక ఓనర్ రాజేందర్ టీవీ సౌండ్ మరింతగా పెంచేశాడు. వారి గొడవకంటే టీవీ సౌండ్ అధికం కావడంతో, భార్యాభర్తలు ఓనర్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నారు. గొడవ విషయంలో ఓనర్ కూడా తగ్గలేదు.
దీంతో అద్దెకు ఉండే వ్యక్తి కోపంతో ఇనుపరాడ్తో రాజేందర్ తలపై కొట్టాడు. దీంతో అయన కిందపడిపోయాడు. హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అద్దెకు ఉండే వ్యక్తి అక్కడి నుంచి చల్లగా తప్పించుకున్నాడు.
తర్వాతి కథనం
