1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:32 IST)

స్కూల్ ప్రాంగణంలో మద్యం బాటిళ్లు.. నాలుగో తరగతి అమ్మాయిపై..?

విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. 
 
విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. 
 
ఈ ఘటనతో పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటేనే తల్లిదండ్రులు హడలెత్తి పోతున్నారు. అటుగా రోడ్డుపై వెళ్తున్న బాలికను బలవంతంగా పట్టుకొని స్కూల్ గోడపై నుండి లోపలికి పడవేశారు ఆకతాయిలు.
 
తర్వాత గంటపాటు ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో ఆ ఆకతాయిలు పారిపోయారు. అమ్మాయి బట్టలు చిరిగి ఉండటంతో గమనించి తల్లిదండ్రులు జరిగిన విషయం ఆరాతీశారు. 
 
అనంతరం ఘటనపై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.