1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Adani Skill Development Centre conducts first port training with international participants

అంతర్జాతీయ పార్టిసిపెంట్స్‌తో మొదటి పోర్ట్ శిక్షణను నిర్వహించిన అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్

port training with international participants
కృష్ణపట్నం: అదానీ ఫౌండేషన్ యొక్క నైపుణ్య విభాగమైన అదానీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్(ASDC), ఇటీవల కృష్ణపట్నం పోర్టులో 90 రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపుతో ఒక ముఖ్యమైన మైలురాయిని వేడుక జరుపుకుంది. ASDC యొక్క నౌకా సంబంధిత శిక్షణా కోర్సులో అంతర్జాతీయ అభ్యర్థులు పాల్గొనటం ఇదే మొదటిసారి. వసుధైవ కుటుంబకం- ఈ ప్రపంచమే ఒక కుటుంబం అనే భావనను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ బ్యాచ్‌లో టాంజానియా నుండి 10 మంది శిక్షణార్థులు, భారతదేశం నుండి 20 మంది విద్యార్థులు ఉన్నారు, ఇది వైవిధ్యమైన, సుసంపన్నమైన అభ్యాస వాతావరణాన్ని సృష్టించింది.
 
“మా టాంజానియన్ శిక్షణార్థుల విజయాలు వసుధైవ కుటుంబకంపై మా నమ్మకాన్ని ఉదాహరిస్తాయి. ఈ కార్యక్రమం, సరిహద్దుల వెంబడి వ్యక్తులను శక్తివంతం చేయడం, ఆధునిక సముద్ర పరిశ్రమల సవాళ్లకు సన్నద్ధమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని నిర్మించడం అనే మా లక్ష్యాన్ని బలోపేతం చేస్తుంది” అని ASDC సీఈఓ శ్రీ జతిన్ త్రివేది అన్నారు.
 
అక్టోబర్ 2024లో ప్రారంభించబడిన ఈ పోర్ట్ శిక్షణా కార్యక్రమాలు, ప్రపంచ స్థాయి సముద్ర నైపుణ్యాలతో అభ్యర్థులను సన్నద్ధం చేయడానికి రూపొందించబడ్డాయి. ఈ పాఠ్యాంశాలు పరిశ్రమ-స్థాయి సిమ్యులేటర్లపై సైద్ధాంతిక, ఆచరణాత్మక మాడ్యూళ్ల మిశ్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి  రబ్బరు టైర్డ్ గ్యాంట్రీ (RTG) క్రేన్ ఆపరేషన్లు, హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్, మెరైన్ ఇంజిన్, మెకానికల్ సిస్టమ్స్ (MEMS)లో శిక్షణ అందించారు.
 
“ఈ శిక్షణ కార్యక్రమం మాకు నేర్చుకోవడం కంటే ఎక్కువ. RTG క్రేన్‌లను మాస్టరింగ్ చేయడం నుండి పోర్ట్ కార్యకలాపాల వివరాలను అర్థం చేసుకోవడం వరకు, మా భవిష్యత్తును రూపొందించే నైపుణ్యాలు, విశ్వాసాన్ని మేము పొందాము” అని టాంజానియా నుంచి వచ్చిన శిక్షణార్థి ఫ్రాంక్ దౌద్ మ్గెండి అన్నారు.
 
టాంజానియా నివాసి లామెక్ రోజాస్ కిడాసి మాట్లాడుతూ భారతదేశానికి రావటం తనకు ఇది తొలిసారి అని అన్నారు. “భారతదేశానికి రావడం, ఇతర విద్యార్థులతో కలిసి నేర్చుకోవడానికి, పని చేయడానికి అవకాశం పొందడం చాలా సరదాగా ఉంది. భవిష్యత్ అవకాశాల గురించి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను” అని అన్నారు.
 
కృష్ణపట్నం ఫెసిలిటీలో విద్యార్థుల కోసం సర్టిఫికేషన్ వేడుక జరిగింది, అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్(AKPL)లో డ్రై కార్గో హెడ్ శ్రీ విజయ్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AKPL భద్రత మరియు పర్యావరణ అధిపతి శ్రీ కౌశల్ సింగ్ మరియు AKPL మార్కెటింగ్ అధిపతి శ్రీ సిద్ధార్థ్ లు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ASDC యొక్క కృష్ణపట్నం ఫెసిలిటీ, 20 ఎకరాలకు పైగా విస్తరించి, 21 సిమ్యులేషన్-ఆధారిత కార్యక్రమాలను అందిస్తోంది, ఇది నైపుణ్యాభివృద్ధిలో అత్యుత్తమ కేంద్రంగా ఉంది. 2016 నుండి, ASDC 1,60,000 మంది యువతకు శిక్షణ ఇచ్చింది, 68% మంది స్థిరమైన జీవనోపాధిని పొందుతున్నారు, సమిష్టిగా ఏటా రూ.1,400 కోట్లకు పైగా ఆర్థిక ప్రభావాన్ని సృష్టిస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
భాక్రా కాలువలో 22 యేళ్ల ట్రైనీ ఎయిర్‌హోస్టెస్ నిషా మృతదేహం (Video)