1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Roja comments on 3 capitals

హైదరాబాద్ విషయంలో జరిగేదే ఏపీలోనూ జరుగుతుందేమో: రోజా

Roja
రాజధానికి, రాజధాని రైతులకు సీఎం జగన్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణపై ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 
 
కానీ ఒకేచోట అభివృద్ధి అంతా కేంద్రీకృతమైతే హైదరాబాద్ విషయంలో జరిగిందే ఏపీలోనూ జరుగుతుందేమోనన్న ఆలోచనతోనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని రోజా వివరించారు. 
 
ఇప్పటికే వెనుకబడి ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు మళ్లీ ఉద్యమానికి పూనుకుంటే రాష్ట్రంలో సమస్యలు వస్తాయని సీఎం గుర్తించారని తెలిపారు. అందుకే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
 
కొత్త బిల్లు తెచ్చే క్రమంలో రైతులతోనూ, న్యాయస్థానాల్లో కేసులు వేసిన వారితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని రోజా వివరించారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పెట్రోల్ వినియోగదారులకు శుభవార్త - తగ్గనున్న ధరలు