సంబంధిత వార్తలు
- నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్.. 40వేల మందికి..?
- కరోనావైరస్ సంక్షోభం తర్వాత గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్ మరింత బలపడతాయా?
- పీఎఫ్ సొమ్ము విత్డ్రాకు క్యూ కట్టిన ఉద్యోగులు.. 10 రోజుల్లోనే....
- శ్రీమంతుల సిటి న్యూయార్క్ దుస్థితి చూడండి.. పాక్ ప్రజలకు ఇమ్రాన్ విజ్ఞప్తి
- కరోనా దెబ్బకు చైనాలో పిల్లులు - కుక్కల మాంసంపై నిషేధం
ఆన్లైన్లో సెప్టెంబర్ 28న జేఈఈ పరీక్షలు.. నైపర్ ప్రకటన
Online Exams
కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష జూన్ 14న జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాడు. కరోనాతో జూలై 25కు వాయిదా పడిన ఈ పరీక్షలను అదే రోజున నిర్వహించుటకు కుదరకపోవడంతో పరీక్ష మరోమారు వాయిదాపడింది. తాజాగా పరీక్షను సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని తెలిపింది. పూర్తి వివరాలకోసం అధికార వెబ్సైట్ niperahm.ac.in చూడవచ్చని నైపర్ వెల్లడించింది. ఈ ఏడాది జేఈఈని అహ్మదాబాద్లోని నైపర్ నిర్వహిస్తోంది.
నైపర్ జేఈఈ ద్వారా అహ్మదాబాద్, హైదరాబాద్, హాజీపట్, కోల్కతా, రాయ్బరేలి, ఎస్ఏఎస్ నగర్లోని నైపర్ క్యాంపస్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లో మాస్టర్ ఇన్ ఫార్మసీ (ఎంఫార్మా), మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్ ఫార్మా), మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్ ఫార్మా), పీహెచ్డీ ప్రోగామ్ల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కాలేజీల్లో 820 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
