1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. 147 positive cases in Ap prakasam district school

ఏపీలో కరోనా విజృంభణ: ప్రకాశం జిల్లా పాఠశాలలో 147 మందికి పాజిటివ్

Andhra pradesh
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రోజుకు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం రేపింది. 
 
తాజాగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటి‌వ్‌గా నిర్ధారణ అయింది. సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజుల్లో మొత్తం 147 మందికి ఆ పాఠశాలలో కరోనా వైరస్‌ సోకింది.
 
నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదైన 772 కరోనా కేసుల్లో పాఠశాలల్లోనే 10 శాతం కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
రెచ్చిపోయిన మావోలు.. ట్రాక్టర్లకు నిప్పు.. కోటి నష్టం