సంబంధిత వార్తలు
- పీఆర్సీ రగడ : సంప్రదింపులకు సర్కారువారి కమిటీ - ఫిబ్రవరి 7 నుంచి సమ్మె
- ఉద్యోగుల ఐక్య పోరు - అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ
- ఏపీలో మధ్యాహ్నం భోజన పథకం మెనూలో మార్పులు
- విశాఖ - న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు...
- ఏపీలో జిల్లాకో విమానాశ్రయం : "వన్ డిస్ట్రిక్ట్ - వన్ ఎయిర్పోర్ట్"పై సీఎం జగన్ రివ్యూ
ఏపీలో కరోనా విజృంభణ: ప్రకాశం జిల్లా పాఠశాలలో 147 మందికి పాజిటివ్
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఏపీలో రోజుకు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలల్లో కరోనా కల్లోలం రేపింది.
తాజాగా 54 మంది ఉపాద్యాయులు, 18 మంది విద్యార్థులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్గా నిర్ధారణ అయింది. సంక్రాంతి సెలవుల అనంతరం గత ఐదు రోజుల్లో మొత్తం 147 మందికి ఆ పాఠశాలలో కరోనా వైరస్ సోకింది.
నిన్న జిల్లా వ్యాప్తంగా నమోదైన 772 కరోనా కేసుల్లో పాఠశాలల్లోనే 10 శాతం కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకూ పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటుంది.
