సంబంధిత వార్తలు
- ఆంధ్రాలో 12 వేల కరోనా కేసులు - 12 మంది మృతి
- కొత్త వైరస్ నియోకోవ్ ... సెమ్మ డెంజర్ మచ్చీ.. ప్రతి ముగ్గిరిలో ఒకరు మృతి!
- దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత - నేడు 2.51 లక్షల కేసులు
- మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
- కరోనా వైరస్ వచ్చినట్లే లేదు.. కానీ శరీరంపై దద్దుర్లు, వళ్లంతా కుళ్లబొడుస్తున్న ఫీలింగ్
బ్రెజిల్లో ముగ్గురికి 70 రోజులుగా కోవిడ్ పాజిటివ్
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ తొలి వేవ్లో భారీ సంఖ్యలో కోవిడ్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటికీ కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు.
అయితే, కరోనా వైరస్ సోకిన బాధితులకు ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు. కానీ, అందుకు భిన్నంగా కరోనా వైరస్ ఎక్కువ రోజుల పాటు యాక్టివ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
బ్రెజిల్లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురులో ఈ తరహా విలక్షణమైన కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఈ ముగ్గురిలో గత 70 రోజులుగా కరోనా వైరస్ శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. వీరికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తూనే ఉన్నారు.
ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన కొందరు బాధితుల్లో ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కేసులు విలక్షణమైన కేసులుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తర్వాతి కథనం
