1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (12:15 IST)

మైనర్ బాలికను వేధించిన టీడీపీ నేత ఇల్లు సీజ్

విజయవాడ నగరంలో టీడీపీ నేత వినోద్ జైన్  వేధింపులను తట్టుకోలేక తొమ్మిదేళ్ళ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారం ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వినోద్ జైన్‍ను విజయవాడ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నగరంలోని భవానీపురం కుమ్మరిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులోని నిందితుడి ఇంటిని విజయవాడ పోలీసులు సీజ్ చేశారు. 
 
కాగా, ఇటీవల విజయవాడ నగరంలో తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీకి చెందిన నేత ఒకరు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. 
 
పైగా, ఆ బాలిక కూడా చనిపోయే ముందు రాసిపెట్టిన ఆత్మహత్య లేఖలోనూ ఈ విషయాన్ని పేర్కొంది. ఈ లేఖ సంచలనంగా మారింది. పైగా, పోలీసుల విచారణలోనూ ఈ విషయం వెల్లడైంది. దీంతో టీడీపీ నేత వినోద్ జైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలలుగా ఆ బాలికను వినోద్ వేధిస్తూ వచ్చాడని, అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.