సంబంధిత వార్తలు
- ఓబీసీ - ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖారారు
- విశాఖ ఉక్కుపై కేంద్రం అఫిడవిట్ : ఆందోళనబాటలో ఉద్యోగులు
- ప్రైవేట్ వైద్య కాలేజీల్లోని సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ : కేంద్రం
- హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఓకే
- రాజస్థాన్ - మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపాలు ... రిక్టర్ స్కేలుపై...
కరోనా మార్గదర్శకాలను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు నిబంధలను పొడిగించింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలను చేపట్టాలని, అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో కూడా నిబంధనలను పాటించాలని పేర్కొంది.
వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలను సడలించే వెసులుబాటును ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర కల్పించింది. కరోనా కట్టడి కోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా, కరోనా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.
