1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (18:14 IST)

ఏపీలో 122 మందికి కరోనా పాజిటివ్ - ఒమిక్రాన్ కేసులు నిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15,568 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, 122 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఇందులో కృష్ణా జిల్లాలో 19, చిత్తూరు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 10 కేసులు చొప్పున నమోదయ్యాయి. విజయనగరం, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదేసమయంలో కరోనా నుంచి 103 మంది కోలుకున్నారు. అయితే, విశాఖలో మాత్రం ఓ కరోనా రోగి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,77,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,278 యాక్టివ్ కేసులు ఉన్నాయి.