సంబంధిత వార్తలు
- 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించిన కేంద్రం
- కోవిడ్ అనంతరం ఆర్థిక అనిశ్చితి- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 15 సంవత్సరాల కనిష్టానికి పడిపోయిన ప్రశాంతత
- ఆర్మీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కుట్ర
- దేశంలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 13,216 మందికి పాజిటివ్
- దక్షిణాఫ్రికాతో 4th T20I: 82 పరుగుల తేడాతో భారత్ గెలుపు
దేశంలో కొత్తగా 12899 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కొత్తగా మరో 12,899 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,96,692కు చేరుకున్నాయి. ఇందులో 4,26,99,363 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి 5,24,855 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 72474 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు, గడిచిన 24 గంటల్లో అంటే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 15 మంది మహమ్మారికి చనిపోగా 8,515 మంది డిశ్చార్జ్ అయినట్టు పేర్కొంది. ఇది మొత్తం యాక్టివ్ కేసుల్లో 0.17 శాతమని వివరించింది. ప్రస్తుతం కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 98.62 శాతంగా ఉండగా, మరణాలు రేటు 1.21 శాతంగా ఉందని ఆ ప్రకటన పేర్కొంది.
